‘పంట నమోదు వేగవంతం చేయాలి’

ABN , First Publish Date - 2020-07-12T10:26:52+05:30 IST

సోమవారం నుంచి ఈక్రాప్‌ నమోదు వేగవంతం చేయాలని తహసీల్దార్‌ రుద్రగౌడు అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఈక్రాఫ్‌ బుకిం గ్‌పై వీఆర్వోలు,

‘పంట నమోదు వేగవంతం చేయాలి’

కోసిగి, జూలై 11: సోమవారం నుంచి ఈక్రాప్‌ నమోదు వేగవంతం చేయాలని తహసీల్దార్‌ రుద్రగౌడు అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఈక్రాఫ్‌ బుకిం గ్‌పై వీఆర్వోలు, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, సర్వేయర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిం చారు. సర్వే నెంబర్ల ఆదారంగా వంద మంది రైతులకు తక్కువ కాకుండా ఆన్‌ లైన్‌లో పంటలు నమోదు చేయాలన్నారు.


ఆన్‌లైన్‌లో  నమోదైతేనే రైతులకు సబ్సిడీ పథకాలు, పంటల ఇన్సూరెన్స్‌, ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా నగదు వంటి సం క్షేమ పథకాలు రైతులకు లభిస్తుందని తహసీల్దార్‌ తెలిపారు.  ఆర్‌ఐ మహేష్‌, వీఆ ర్వోలు బసవరాజు, తిక్కస్వామి, మారెన్న, ఏసుదాసు, రామాంజి, బాలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-12T10:26:52+05:30 IST