ఎకరాకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2020-11-30T06:46:24+05:30 IST

తుఫాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎకరాకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలి


రాంబిల్లి, నవంబరు 29 :  తుఫాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు  ఎకరాకు రూ.30 వేలు చొప్పున  నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం  నియోజకవర్గ సీనియర్‌ నేత ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డి.రంగనాయకులు, మండల శాఖ అధ్యక్షుడు వి.దిన్‌బాబులతో కలిసి కుమ్మరాపల్లిలో పర్యటించి, నీటి మునిగిన పొలాలను పరిశీలించారు.  అనంతరం మర్రిపాలెంలో దెబ్బతిన్న బొడ్డేడ ఆనకట్ట గట్టును పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

Updated Date - 2020-11-30T06:46:24+05:30 IST