బెస్తపల్లె వద్ద దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న టీడీపీ నేత మధుబాబు
తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు
మదనపల్లె టౌన్, డిసెంబరు 3: వరదలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె మండలం బెస్తపల్లె వద్ద రైతులు పండించిన వరి పంటను మధుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోత దశలో ఉన్న వరి అధిక వర్షాలతో దెబ్బతిందన్నారు. ప్రభుత్వం పరిశీలించి తూతూమంత్రంగా కాకుండా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్, పూల మురళి, తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు.