డ్వాక్రా గ్రూప్ సభ్యులకు యానిమేటర్ టోకరా?
ABN , First Publish Date - 2021-01-24T06:40:00+05:30 IST
డ్వాక్రా రుణాల్లో ఓ యానిమేటర్ గ్రూప్ సభ్యులకు టోకరా వేసింది. మాచవరానికి చెందిన రెండు సంఘాలకు సంబంధించి గత ఏడాది అక్టోబరులో బ్యాంకు ద్వారా డ్వాక్రా రుణాలు మంజూరు చేశారు.
లక్షలాది రూపాయల గోల్మాల్
ఏపీఎంను నిలదీసిన డ్వాక్రా గ్రూపు సభ్యులు
అంబాజీపేట, జనవరి 23: డ్వాక్రా రుణాల్లో ఓ యానిమేటర్ గ్రూప్ సభ్యులకు టోకరా వేసింది. మాచవరానికి చెందిన రెండు సంఘాలకు సంబంధించి గత ఏడాది అక్టోబరులో బ్యాంకు ద్వారా డ్వాక్రా రుణాలు మంజూరు చేశారు. దీనిలో అంబాజీపేటకు చెందిన తలుపులమ్మ మహిళాశక్తి సంఘానికి సంబంధించి రూ.10.50లక్షలు, కరుణమయ గ్రూప్ సభ్యులకు రూ.7.50లక్షలు మంజూరు చేశారు. అయితే ఈగ్రూప్ సభ్యులకు సంబంధించి అప్పు మినహా మిగిలిన సొమ్మును వారి ఖాతాకు బ్యాంకు అధికారులు జమచేశారు. అయితే ఈసొమ్ములను యానిమేటర్ డ్రా చేసినట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. సొమ్ములు ఇవ్వాలంటూ గ్రూప్ సభ్యులు స్థానిక వెలుగు కార్యాలయం వద్ద శనివారం ఐకేపీ ఏపీఎం పి.సువార్తను నిలదీశారు. వెంటనే ఆమె ఈవిష యాన్ని అమలాపురం ఏరియా కోఆర్డినేర్ అన్నపూర్ణకు తెలియజేశారు. దీనిపై సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అనంతరం చర్యలు తీసుకునేలా చూస్తానని కోఆర్డినేటర్ అన్నపూర్ణ తెలిపినట్టు ఏపీఎం సువార్త తెలిపారు.