14 ఏళ్ల‌లో 80 మందిని పొట్ట‌న‌పెట్టుకున్న మొస‌లి ప‌ట్టివేత‌!

ABN , First Publish Date - 2021-06-13T14:25:12+05:30 IST

గ‌డ‌చిన 30 ఏళ్లుగా ఉగాండాలోని...

14 ఏళ్ల‌లో 80 మందిని పొట్ట‌న‌పెట్టుకున్న మొస‌లి ప‌ట్టివేత‌!

కంపాలా: గ‌డ‌చిన 30 ఏళ్లుగా ఉగాండాలోని లూగంగ గ్రామంలోని ఒక చెరువులో ఉంటూ ఎంతోమంది గ్రామ‌స్తుల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న ఒక మొస‌లి ఎట్ట‌కేల‌కు గ్రామస్తుల చేతికి చిక్కింది. ఆ మొసలి గ‌డ‌చిన 14 ఏళ్ల‌లో గ్రామంలోని 80 మందిని చంపేసింది. ఈ కార‌ణంగా గ్రామస్తులు ఆ మొస‌లికి ఒసామా బిన్ లాడెన్ అని పేరు పెట్టారు. ఎట్ట‌కేల‌కు గ్రామస్థులు ఆ మొస‌లిని స‌జీవంగా ప‌ట్టుకున్నారు. గ్రామ స‌మీపంలోని చెరువులో తిష్ట‌వేసిన ఆ మొస‌లిని చూసి గ్రామ‌స్తులు భ‌య‌ప‌డుతుండేవారు. ఆ మొస‌లి వ‌య‌సు 75 ఏళ్లు ఉంటుంది. 16 అడుగుల పొడ‌వుతో  ఉండే ఆ మొస‌లి చెరువు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారిపై దాడి చేస్తుంటుంది. దాని దాడి నుంచి బయటపడిన ప‌లువురు గ్రామ‌స్తులు ఈ నాటికీ అంగ‌వైక‌ల్యంతో కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఆ మొస‌లిని ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు దానిని అట‌వీశాఖ అధికారుల‌కు అప్ప‌గించారు. 

Updated Date - 2021-06-13T14:25:12+05:30 IST