ట్రాన్స్కో ఎస్ఈపై విమర్శలు సరికాదు
ABN , First Publish Date - 2022-07-02T05:07:27+05:30 IST
విద్యుత్ శాఖలో పారదర్శకంగా బదిలీలు చేపడుతున్న ట్రాన్స్కో ఎస్ఈ మాదవరెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రీజినల్ అధ్యక్షుడు కనకరాజు, కార్యదర్శి జి.శ్రీనివాస్ అన్నారు
సంగారెడ్డి టౌన్, జూన్ 1: విద్యుత్ శాఖలో పారదర్శకంగా బదిలీలు చేపడుతున్న ట్రాన్స్కో ఎస్ఈ మాదవరెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రీజినల్ అధ్యక్షుడు కనకరాజు, కార్యదర్శి జి.శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డిలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొందరు వెల్ఫేర్ అసోషియేషన్ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎస్ఈపై అభియోగాలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికుల బదిలీలు నిబంధనలకు అనుగుణంగా చేస్తుంటే కొందరు ధర్నాలు చేయడం సరికాదన్నారు. విద్యుత్ శాఖలో గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్లు 327తో పాటు 1104 ట్రాన్స్కో ఎస్ఈకి మద్దతుగా నిలుస్తాయన్నారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రంజిత్, అదనపు కార్యదర్శి టి.సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ అదనపు కార్యదర్శి ఎం.రవికుమార్, కోశాధికారి రాములు తదితరులు పాల్గొన్నారు.