ఉనికిని కాపాడుకోవడం కోసమే విమర్శలు

ABN , First Publish Date - 2020-06-02T09:28:08+05:30 IST

రాజకీయంగా ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర

ఉనికిని కాపాడుకోవడం కోసమే విమర్శలు

సూర్యాపేట టౌన్‌/ఆత్మకూర్‌(ఎస్‌)/చివ్వెంల : రాజకీయంగా ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.


సూర్యాపేటలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆత్మకూర్‌(ఎస్‌), చివ్వెంలలో టీఆర్‌ఎస్‌ నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకుని, మంత్రికి క్షమాపణ చెప్పాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, జడ్పీటీసీలు సభ్యుడు జీడీ భిక్షం, సంజీవనాయక్‌, చివ్వెంల ఎంపీపీ ధరావత్‌ కుమారీబాబునాయక్‌, కొణతం సత్యనారాయణరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, సర్ప ంచ్‌ వీరారెడ్డి, సుధాకర్‌రెడ్డి, గురువేందర్‌ ఉత్తమ్‌ తీరును విమర్శించారు. 

Updated Date - 2020-06-02T09:28:08+05:30 IST