వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు: మంత్రి చెరుకువాడ
ABN , First Publish Date - 2020-06-05T09:56:36+05:30 IST
పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల విషయంలో డబ్బులు వసూలు చేస్తే, ఎంతటి వారిపైనైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు హెచ్చరించారు. పోడూరు మండలం పెనుమదంలో ఒక వ్యక్తి
ఆచంట, జూన్ 4: పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల విషయంలో డబ్బులు వసూలు చేస్తే, ఎంతటి వారిపైనైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు హెచ్చరించారు. పోడూరు మండలం పెనుమదంలో ఒక వ్యక్తి ఇళ్ల స్థలాల కోసం అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్తో మాట్లాడి కేసు నమోదు చేయించానని చెప్పారు. ‘‘అక్రమాలు జరిగాయంటూ కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ఒక ప్రజాప్రతినిధి (వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి) మాట్లాడటంపై పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆగస్టు నాటికి మొదటి విడతగా 15 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.’’ అని చెరుకువాడ పేర్కొన్నారు.