ఇల్లు కట్టించుకొని డబ్బు ఎగ్గొట్టిన హోం గార్డు

ABN , First Publish Date - 2022-08-09T06:08:12+05:30 IST

ఇల్లు కట్టించుకొని డబ్బు ఎగ్గొట్టడమే కాకుండా నిర్మాణదారుడిని బెదిరిస్తున్న హోంగార్డుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇల్లు కట్టించుకొని డబ్బు ఎగ్గొట్టిన హోం గార్డు

బంజారాహిల్స్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇల్లు కట్టించుకొని డబ్బు ఎగ్గొట్టడమే కాకుండా నిర్మాణదారుడిని బెదిరిస్తున్న హోంగార్డుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిరోజ్‌గూడకు చెందిన డి. స్వామి నిర్మాణదారుడు. బంజారాహిల్స్‌లో ఓ భవన నిర్మాణం చేస్తుండగా హోంగార్డు సురేష్‌ అతడిని కలిశాడు. రోడ్డు నెంబరు 5 దేవరకొండ బస్తీలో తన పాత ఇంటిని కూల్చి రెండతస్తుల భవనం కట్టి ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భవన నిర్మాణం పూర్తయ్యాక హోంగార్డు రూ. 1.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. డబ్బు ఇవ్వాలని స్వామి అడగగా.. సురేష్‌ వాయిదా వేస్తూ వచ్చాడు. ఇటీవల హోంగార్డును ఆయన నిలదీయగా బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హోంగార్డుపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-08-09T06:08:12+05:30 IST