వస్త్ర వ్యాపారిపై దాడి

ABN , First Publish Date - 2022-08-08T05:54:42+05:30 IST

నీ వద్ద కొనుగోలు చేసిన దుస్తులు బాగాలేవు. చిరిగిపోయినవి అమ్మావు. మా డబ్బులు ఇవ్వాలని ద్విచక్రవాహనంపై తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్న వ్యక్తిపై నలుగురు దాడిచేశారు.

వస్త్ర వ్యాపారిపై దాడి

దుస్తులు, ద్విచక్రవాహనం లాక్కొని పరారీ

పంజాగుట్ట, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నీ వద్ద కొనుగోలు చేసిన దుస్తులు బాగాలేవు. చిరిగిపోయినవి అమ్మావు. మా డబ్బులు ఇవ్వాలని ద్విచక్రవాహనంపై తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్న వ్యక్తిపై నలుగురు దాడిచేశారు. అతడిని బెదిరించి దుస్తులు, ద్విచక్రవాహనం లాక్కొని పారిపోయిన ఘటన పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. యూపీ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన ఎండీ ఖాసిఫ్‌ ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం నగరానికి వచ్చాడు. మీరాలంమండిలో ఉంటూ ద్విచక్రవాహనంపై పలు ప్రాంతాల్లో తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్నాడు. ఆదివారం దుస్తులు విక్రయించడానికి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై అమీర్‌పేట వైపు బయలుదేరాడు. పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు ఆగంతుకులు ఖాసిఫ్‌ వాహనానికి తమ వాహనాలు అడ్డు పెట్టారు. పది రోజుల క్రితం నీ వద్ద దుస్తులు కొనుగోలు చేశాము.. అవి బాగాలేవు.. మా డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయగా ఖాసిఫ్‌ నిరాకరించాడు. కోపోద్రిక్తులైన వారు అతడి హోండా యాక్టివా వాహనాన్ని, రూ. 5 వేల విలువగల వస్త్రాలు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-08T05:54:42+05:30 IST