లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-02-27T04:50:58+05:30 IST

లారీ ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో జరిగింది.

లారీ ఢీకొని యువకుడి మృతి

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 26: లారీ ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జల్లేరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన డ్రైవర్‌ అద్దేపల్లి అశోక్‌కుమార్‌, నంబూరి ప్రవీణ్‌రావు ట్రాక్టర్‌పై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌రావు (25)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన లారీ ఆపకుండా వెళ్లిపోయింది. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ మంగయ్య తెలిపారు.

Updated Date - 2021-02-27T04:50:58+05:30 IST