అప్పు అడిగినందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

ABN , First Publish Date - 2020-08-06T00:07:52+05:30 IST

పీలేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు డబ్బును తిరిగి ఇవ్వమన్నుందుకు వ్యక్తిపై మరో వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు

అప్పు అడిగినందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

తిరుపతి : పీలేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు డబ్బును తిరిగి ఇవ్వమన్నుందుకు వ్యక్తిపై మరో వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు మండలంలోని బోడుమల్లువారిపల్లెకు చెందిన శంకర్ నారాయణ రెడ్డి.. పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన వినోద్‌ కుమార్‌ రెడ్డికి రూ. 5 లక్షల మేర అప్పు ఇచ్చాడు. ఇదే విషయమై శంకర్ నారాయణ రెడ్డి.. వినోద్‌ను నిలదీసి అడిగాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన వినోద్.. శంకర్ నారాయణపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ నారాయణ రెడ్డిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-06T00:07:52+05:30 IST