మద్యం మత్తులో ఘర్షణ

ABN , First Publish Date - 2021-01-16T05:26:28+05:30 IST

మద్యం మత్తులో ఇరువర్గాలు గొడవ పడిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

మద్యం మత్తులో ఘర్షణ

ఇరువర్గాల మధ్య కొట్లాట

ముగ్గురు వ్యక్తులు ఒకడిపై దాడి

మద్యం బాటిళ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయాలు

తాటిచెట్లపాలెం, జనవరి 15 : మద్యం మత్తులో ఇరువర్గాలు గొడవ పడిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కంచరపాలెం పోలీసుల కథనం మేరకు...పల్లాలోకేష్‌, బాబ్జి, పొట్టిప్రకాష్‌, మరికొందరు దుర్గానగర్‌లోని ఓ మద్యం దుకాణం వద్దకు వచ్చారు. అదే సమయంలో కంచర పాలెంకు చెందిన లోకేష్‌ (ఇతను మరొకడు)తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో లోకేష్‌ తలపై మద్యం బాటిళ్లతో కొట్టడంతో అతను గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-01-16T05:26:28+05:30 IST