విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:22:58+05:30 IST

మండలంలోని నరగాయపాలెంలో మట్టి తోలుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగెలు తగలడంతో డైవ్రర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో  డ్రైవర్‌ మృతి

 వినుకొండటౌన్‌, జనవరి 15: మండలంలోని నరగాయపాలెంలో మట్టి తోలుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగెలు తగలడంతో డైవ్రర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలివి..  పోట్లూరుకు చెందిన చల్లా రామాంజనేయులు(37) మండలంలోని నరగాయపాలెంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణానికి మట్టి తోలుతున్నాడు. గురువారం మట్టి అన్‌లోడ్‌ చేసే సమయంలో ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధులువు పట్టణంలోని శివయ్యస్థూపం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:22:58+05:30 IST