కాలువలో పడి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:22:04+05:30 IST

మండలంలోని రొంపిచర్ల సమీపంలోని తంగేడుమల్లి మేజర్‌ కాలువలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు.

కాలువలో పడి ఇద్దరు మృతి

రొంపిచర్ల, జనవరి 15: మండలంలోని రొంపిచర్ల సమీపంలోని తంగేడుమల్లి మేజర్‌ కాలువలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన ఇమ్మడి శ్రీను(48), శావల్యాపురం మండలం వెలమావారిపాలెం గ్రామానికి చెందిన వంగా ఆంజనేయులు(40), రాఘవులు, జూపూల్లి శ్రీను, ఈపూరు మండలం చిట్టాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు పనుల నిమిత్తం రొంపిచర్లకు వచ్చారు.  తిరుగు ప్రయాణంలో రొంపిచర్ల సమీపంలోని తంగేడుమల్లి మేజరు వద్ద బహిర్భూమికి వెళ్లారు. ఇమ్మడి శ్రీను ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో అతనిని కాపాడేందుకు ఆంజనేయులు, రాఘవులు, శ్రీను ఒకరి తరువాత ఒకరు కాలువలోకి కాపాడటానికి దూకారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వచ్చి రాఘవులు, జూపల్లి శ్రీనును బయటకు తీశారు. ఇమ్మడి శ్రీను, వంగా ఆంజనేయులు నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు.  

Updated Date - 2021-01-16T05:22:04+05:30 IST