నమాజ్‌కు వెళ్లొచ్చేసరికి చోరీ

ABN , First Publish Date - 2021-04-16T06:55:30+05:30 IST

నమాజ్‌కు వెళ్లొచ్చేసరికి విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.

నమాజ్‌కు వెళ్లొచ్చేసరికి చోరీ

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):నమాజ్‌కు వెళ్లొచ్చేసరికి విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. జనగాంకు చెందిన మహ్మద్‌ నజీముద్దీన్‌ పారామౌంట్‌ కాలనీలోని జిలాని ప్లాజాలో నివసిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం నమాజ్‌ చేసేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బాల్కనీలో తలుపు తెరిచి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా 3.25 తులాల గొలుసు, రెండు తులాల చెవి కమ్మలు, రింగులు, రూ. 5,500 కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-16T06:55:30+05:30 IST