2నుంచి ఆల్‌ఇండియా మహిళా క్రికెట్‌ టోర్నీ

ABN , First Publish Date - 2021-02-27T04:03:55+05:30 IST

మార్చి 2 నుంచి 7 వరకు ఖమ్మం సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో ఆల్‌ ఇండియా మహిళా క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌, మతిన్‌ తెలిపారు.

2నుంచి ఆల్‌ఇండియా మహిళా క్రికెట్‌ టోర్నీ
మాట్లాడుతున్న డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌

 మూడోసారి నగరంలో  టీ20 నిర్వహణ

పాల్గోననున్న బంగ్లాదేశ్‌, నేపాల్‌ జట్లు

ఖమ్మం స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 26:  మార్చి 2 నుంచి 7 వరకు ఖమ్మం సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో ఆల్‌ ఇండియా మహిళా క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌, మతిన్‌ తెలిపారు. శుక్రవారం న్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ఉమెన్‌ 20- 20 క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు బంగ్లాదేశ్‌, నేపాల్‌ జట్లతో పాటు ఆతిఽథ్య తెలంగాణ, తమిళ నాడు, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ   ఆరు జట్లు పాల్గోంటాయన్నారు. హైదరాబాద్‌ తరువాత ఖమ్మం ఎస్పీ స్టేడియంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే విధంగా టర్ఫ్‌వికెట్‌ పిచ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. నగరంలో మూడోసారి మహిళా టి-20 టోర్నీ నిర్వహిస్తు న్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఖమ్మంలో ఆడటం.. జిల్లాకు గర్వకార ణమన్నారు.  ఈ పోటీలను రోటరీ క్లబ్‌ ఆప్‌ స్థంబాధ్రి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నిర్వాహకులు వెంపటి సత్యనారాయణ, దొడ్డా రవి, సునిల్‌ రెడ్డి, అఫ్జల్‌ హాసన్‌, డాక్టర్‌ కరీం, వి.సాంబమూర్తి  ఉన్నారు.

Updated Date - 2021-02-27T04:03:55+05:30 IST