ముగిసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ జట్టు ఎంపికపోటీలు
ABN , First Publish Date - 2021-09-18T03:59:52+05:30 IST
వెంకటగిరి పట్టణంలోని తారకరామా క్రీడా ప్రాంగణంలో ఈ నెల 15 నుంచి ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు శుక్రవారం ముగిశాయి.
వెంకటగిరి, సెప్టెంబరు 17: వెంకటగిరి పట్టణంలోని తారకరామా క్రీడా ప్రాంగణంలో ఈ నెల 15 నుంచి ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు శుక్రవారం ముగిశాయి. సౌత్ జోన్ పరిధిలోని 3 జట్ల మద్య పోటీ జరగగా బీ జట్టు విన్నర్స్గా, సీ జట్టు రన్నర్గా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ఏసీఏ ప్రతినిధులు బహుమతులను ఆందజేశారు. ఎంపికైన 15 మంది పేర్లను త్వరలో ప్రకటించ నున్నట్లు సౌత్ జోన్ ఉమెన్ సెలెక్షన్ కమిటీ సభ్యుడు, రంజీ క్రీడాకారుడు గోకుల్ కృష్ణసింగ్ తెలిపారు. ఎంపిక చేసిన జట్లకు జోన్ల వారీగా మంగళగిరిలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎన్డీసీఏ సెక్రెటరీ శ్రీనివాసుల రెడ్డి, కడప సెక్రెటరి సంజయ్ కుమార్, వీఎస్సీసీ సెక్రెటరీ చెంచు సుబ్రమణ్యం, ఏసీఏ స్కోరర్ సీడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.