యారాడలో క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-04T05:35:29+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యారాడలో స్థానిక యువకులు యారాడ ప్రీమియం లీగ్‌ (వైపీఎల్‌) పేరుతో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించారు.

యారాడలో క్రికెట్‌ పోటీలు ప్రారంభం
పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

మల్కాపురం, జూలై 3: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యారాడలో స్థానిక యువకులు యారాడ ప్రీమియం లీగ్‌ (వైపీఎల్‌) పేరుతో  క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లను టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, వైసీపీ గాజువాక ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి, కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి ప్రారంభించారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచే టీమ్‌కు రూ.50 వేల నగదు బహుమతిని అందజేయనున్నారు. ప్రతీ ఆదివారం మాత్రమే ఈ పోటీలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అచ్చారావు, చిట్టి, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T05:35:29+05:30 IST