క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ABN , First Publish Date - 2021-04-23T06:46:30+05:30 IST
క్రికెట్ బెట్టింగ్పై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. బందరు గొడుగుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను గురువారం పోలీసులు అరెస్టు చేసి వద్ద రూ 5,24,783 నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక యాపిల్ ట్యాబ్, ఒక కలర్ టీవీ, రెండు కాలిక్యులేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 22 : క్రికెట్ బెట్టింగ్పై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. బందరు గొడుగుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను గురువారం పోలీసులు అరెస్టు చేసి వద్ద రూ 5,24,783 నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక యాపిల్ ట్యాబ్, ఒక కలర్ టీవీ, రెండు కాలిక్యులేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ, ఐపీఎల్ టి-20 మ్యాచ్లను ఆసరాగా చేసుకుని ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. డీఎస్పీ రమేష్ రెడ్డి, ధర్మేంద్ర, ఇనగుదురు సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కేసులను ఛేదించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు.