ఒకే వేదికలో సిరీస్!
ABN , First Publish Date - 2020-05-30T09:11:03+05:30 IST
భారత్తో టెస్టు సిరీస్ కోసం నాలుగు వేదికలు ప్రకటించినా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులుంటాయని క్రికెట్ ..
మెల్బోర్న్: భారత్తో టెస్టు సిరీస్ కోసం నాలుగు వేదికలు ప్రకటించినా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులుంటాయని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. ప్రయాణ ఆంక్షలపై పరిమితి ఉంటే వీలైతే ఒక వేదికలోనే ఆడించే అవకాశం లేకపోలేదని తెలిపింది. ‘ఆయా రాష్ట్రాల సరిహద్దులు తెరుచుకోవడంపై ఆ షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకుంటే ఒకటి లేదా రెండు వేదికలనే ఉపయోగించుకుంటాం. ఇప్పటికైతే ఏ విషయం చెప్పలేం’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపాడు. మరోవైపు ఈసారి సిరీ్సలో పెర్త్ను మినహాయించడంపై ఆయన స్పందించాడు. రెండేళ్ల క్రితం భారత్తో సిరీస్ జరిగినప్పుడు బ్రిస్బేన్కు అవకాశం ఇవ్వలేదని, అందుకే ఈసారి పెర్త్ను పక్కనబెట్టామని తెలిపాడు.