మృతదేహాల దహనానికి కట్టెల స్థానంలో ఇక ఆవు పిడకలు

ABN , First Publish Date - 2021-01-25T12:34:57+05:30 IST

శ్మశానవాటికల్లో మృతదేహాల దహనానికి కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను ఉపయోగించాలని బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది....

మృతదేహాల దహనానికి కట్టెల స్థానంలో ఇక ఆవు పిడకలు

న్యూఢిల్లీ : శ్మశానవాటికల్లో మృతదేహాల దహనానికి కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను ఉపయోగించాలని బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. శ్మశానవాటికల్లో శవాల దహనానికి కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు ఢిల్లీ నగర మేయర్ అనామిక వెల్లడించారు.కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాల దహనం చేయడం వల్ల దీని ఖర్చు కూడా తగ్గుతుందని ఢిల్లీ మేయర్ చెప్పారు. శ్మశానవాటికల వద్ద ఆవుపేడతో చేసిన పిడకలను సిద్ధంగా ఉంచామని మేయర్ చెప్పారు.ఆవు పేడ పిడకలతో శవాల దహనానికి మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బలహీన వర్గాలకు తక్కువ ఖర్చు వల్ల ప్రయోజనకరంగా ఉండటంతోపాటు పిడకలకు ఆవుపేడ ఉపయోగించడం మన సంస్కృతి అని మేయర్ అనామిక వివరించారు.  

Updated Date - 2021-01-25T12:34:57+05:30 IST