ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయి: సీపీఎం నేత
ABN , First Publish Date - 2020-05-26T01:35:29+05:30 IST
ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయని ఏబీఎన్ ది డిబేట్లో మాట్లాడిన సీపీఎం నేత కందారపు మురళి అన్నారు.
హైదరాబాద్: ఏఈవోల స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయని ఏబీఎన్ ది డిబేట్లో మాట్లాడిన సీపీఎం నేత కందారపు మురళి అన్నారు. ఈవోల ఫోటోలు పెట్టి ఏఈవోలే సంతకాలు పెడతారని చెప్పారు. టీటీడీకి భక్తులు ఇస్తున్న ఆస్తులకు సంబంధించి నిర్థిష్టమైన విధానం ఉండాలన్నారు. గతంలో కూడా టీటీడీ బోర్డు ఇదే తీర్మానం చేసిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇంత అర్జెంటుగా అమ్మాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు.