పేదల ఇళ్లు తొలగింపుపై నిరసన
ABN , First Publish Date - 2020-11-29T05:49:30+05:30 IST
పట్టణంలోని గండాలపేట ఎస్టీ కాలనీకి చెందిన పేదల ఇళ్లు గిరి ప్రదక్షిణ పేరుతో తొలగించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
మంగళగిరి క్రైమ్, నవంబరు 28: పట్టణంలోని గండాలపేట ఎస్టీ కాలనీకి చెందిన పేదల ఇళ్లు గిరి ప్రదక్షిణ పేరుతో తొలగించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శనివారం ఇళ్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించిన తరువాతే తొలగించాలన్నారు. రహదారి నిర్మించడం వల్ల 200 మంది గిరిజనులు ఇళ్లు కోల్పోతారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాలకృష్ణ, ఎస్ వెంకటేష్, ఎం సుబ్రహ్మణ్యం, ఎం బాలాజీ, సాంబయ్య పాల్గొన్నారు. కాగా ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సీపీఐ నాయకులు సీహెచ్ తిరుపతయ్య, సత్యనారాయణలు చేరుకుని మద్దతు తెలిపారు.