‘షేక్ రాజా’లో కొవిడ్ పరీక్షలు చేయాలని డిమాండ్
ABN , First Publish Date - 2021-04-21T06:13:01+05:30 IST
‘షేక్ రాజా’లో కొవిడ్ పరీక్షలు చేయాలని డిమాండ్
వించిపేట, ఏప్రిల్ 20: షేక్ రాజా ఆస్పత్రి వద్ద కొవిడ్ పరీక్షలు చేయాలని కార్పొరేటర్ బోయి సత్తిబాబు డిమాండ్ చేశారు. 50వ డివిజన్ కేబీయన్ కాలేజీ పక్కన గల షేక్ రాజా ఆసుపత్రి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉంటున్నారని, కొవిడ్ పరీక్షలు ఎక్కడ చేస్తున్నారో ప్రజలకు తెలియడం లేదన్నారు. షేక్ రాజా ఆసుపత్రి వద్ద పరీక్షలు చేస్తే చుట్టుపక్కల ప్రజలకు దగ్గరగా ఉంటుందన్నారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సత్తిబాబు కోరారు. సీపీఎం నాయకుడు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.