ప్రజా వ్యతిరేక చట్టాలపై ఉద్యమానికి సహకరించండి

ABN , First Publish Date - 2021-07-25T03:00:14+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజావ్యతిరేక విధానాల చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న దేశవ్యాప్త సమ్మె కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని సీపీఎం జిల్లా వ్యవసాయ కమిటీ కార్యదర్శి జె.అంకమ్మరాజు పేర్కొన్నారు.

ప్రజా వ్యతిరేక చట్టాలపై ఉద్యమానికి సహకరించండి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

అల్లూరు, జూలై 24 : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజావ్యతిరేక విధానాల చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న దేశవ్యాప్త సమ్మె కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని సీపీఎం జిల్లా వ్యవసాయ కమిటీ కార్యదర్శి జె.అంకమ్మరాజు పేర్కొన్నారు. అల్లూరు పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల వివక్ష చూపుతూ ఇష్టారాజ్యంగా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తుందని, దీనిని నిరశిస్తూ చేపట్టే దేశవ్యాప్త నిరసనలో పాల్గొనేందుకు బీజేపీ మినహా మిగిలిన అన్ని  పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు టి.గోపాల్‌, జడ్డా మస్తానయ్య, మండల నాయకులు పి.భాస్కర్‌, సిహెచ్‌.వెంకయ్య, షేక్‌ రషీద్‌, మాలకొండయ్య, రఘురామయ్య, విజయలక్ష్మి, రమణయ్య, లక్ష్మయ్య తదితరుల పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T03:00:14+05:30 IST