‘ఆస్తి పన్ను జీవోలు ఉపసంహరించాలి’
ABN , First Publish Date - 2021-06-13T05:26:46+05:30 IST
పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను భారాలు వేసే జీవోలను ప్రభు త్వం వెంటనే ఉపసంహరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సుందరబాబు డిమాండ్ చేశారు.
కొవ్వూరు, జూన్ 12 : పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను భారాలు వేసే జీవోలను ప్రభు త్వం వెంటనే ఉపసంహరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సుందరబాబు డిమాండ్ చేశారు. కొవ్వూరు మునిసిపల్ కార్యాలయం వద్ద సీపీఎం నేతలు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నగర, పట్టణ ప్రజలపై కోటి యాబై లక్షలు రూపాయలు పన్నుల రూపంలో భారం మోపడానికి తీసు కొచ్చిన జీవోలను రద్దుచేయాలన్నారు. కొవ్వూరు మునిసిపాలిటీలో చెత్త సేకరణకు ప్రతి కుటుంబం నుంచి నెలకు యాబై రూపాయలు చెల్లించాలన్న కౌన్సిల్ నిర్ణయాన్ని ఉపసంహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.బాపిరాజు, డి.రాధాకృష్ణ, సుదర్శన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.