ఇళ్ల తొలగింపు చర్యలు ఆపాలి
ABN , First Publish Date - 2022-07-08T03:47:01+05:30 IST
మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను తొలగించే పనిని ఆపాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు
నెల్లూరు(వైద్యం), జూలై 7 : మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను తొలగించే పనిని ఆపాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని సత్యనారాయణపురంలో బాధితులతో కలిసి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి మాట్లాడుతూ మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో ఇళ్లను తొలగించే చర్యలను ఆపాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రైల్వే స్థలాల బాధితులకు యుద్ధప్రాతికన ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. 6 అంకణాల స్థలంలో రూ. 1.80 లక్షలతో ఇళ్ల నిర్మించటం సాధ్యం కాదని, రూ. 6 లక్షలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నరసింహా, ఉడతా ప్రసాద్, ఏమేలు, చిరంజీవి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.