‘బాలింత కుటుంబాన్ని ఆదుకోవాలి’

ABN , First Publish Date - 2021-04-19T05:35:17+05:30 IST

మృతి చెందిన బాలింత అనుసూయ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని సీపీఎం నాయకులు రాముడు, వీరేష్‌ డిమాండ్‌ చేశారు.

‘బాలింత కుటుంబాన్ని ఆదుకోవాలి’

కోసిగి, ఏప్రిల్‌ 18: మృతి చెందిన బాలింత అనుసూయ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని సీపీఎం నాయకులు రాముడు, వీరేష్‌ డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పీహెచ్‌సీలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని, గర్బిణులకు, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. గర్బిణులకు కాన్పు చేసేందుకు మహిళా స్టాఫ్‌ నర్సు, మహిళా గైనకాలజిస్టు, చిన్న పిల్లల డాక్టర్లను నియమించాలని కోరారు.

Updated Date - 2021-04-19T05:35:17+05:30 IST