అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి : కేతా
ABN , First Publish Date - 2021-08-02T05:42:42+05:30 IST
అమర వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతా గోపాలన్ అన్నారు.
ఆచంట, ఆగస్టు 1 : అమర వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతా గోపాలన్ అన్నారు. పెనుమంచిలిలో ఆదివారం కామ్రేడ్ నార్గన నరసింహమూర్తి వర్ధంతి కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ఉన్న స్థూపం వద్ద అమరవీరులు నార్గన నరసింహమూర్తి, పంది నరసింహమూర్తి చిత్రపటాలకు వారి కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిర్రా నరసింహమూర్తి, మామిడిశెట్టి రామాంజనేయులు, వర్దిపర్తి అంజిబాబు,నార్గన శ్రీనివాస్, నార్గన విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.