మోడీ హయాంలో వ్యవస్థల ప్రైవేటీకరణ: తమ్మినేని
ABN , First Publish Date - 2021-11-17T22:43:11+05:30 IST
దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలను అన్నింటిని ప్రధాని మోడీ
నల్లగొండ: దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలను అన్నింటిని ప్రధాని మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను దోచుకుంటుందన్నారు. నిరుద్యోగం, రైతాంగం, కార్మికుల విషయంలో మోడీ విఫలమయ్యారన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.