మూడు రాజధానుల పేరుతో ఖజానా నింపుకునే యత్నం: Baburao

ABN , First Publish Date - 2022-06-28T18:06:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేయాలని తొలి నుంచి ప్రయత్నిస్తోందని సీపీఎం నేత బాబూరావు అన్నారు.

మూడు రాజధానుల పేరుతో ఖజానా నింపుకునే యత్నం: Baburao

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేయాలని తొలి నుంచి ప్రయత్నిస్తోందని సీపీఎం నేత  బాబూరావు (Babu rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమరావతి సీఆర్డీఏ పరిధిలో భూమిలను అమ్మడానికి తీసుకొచ్చిన 389, 390 జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలు కేవలం ఆరంభం మాత్రేమే అని... దశల వారీగా భూములను పూర్తిగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే రాజధాని అని చెబుతూ మరోవైపు ఉద్యోగుల కోసం కట్టిన ప్లాట్లను ప్రైవేటుకు అప్పజెప్పటంలో అర్థం ఎంటో చెప్పాలన్నారు.  సింగపూర్ కంపెనీకి టీడీపీ భూములు అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు అమ్ముతుందని బాబూరావు ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-28T18:06:58+05:30 IST