ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-29T05:28:02+05:30 IST

అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా దోచుకుంటోందని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ఆరోపించారు.

ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 28: అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా దోచుకుంటోందని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలో రోడ్లు, డ్రైయిన్‌లు, వీధిలైట్లు, మంచినీటి సమస్యతోపాట పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని తక్షణం సమస్యలు పరిష్కరించాలన్నారు. నాయకులు కరెడ్ల రామకృష్ణ, పోతు శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:28:02+05:30 IST