రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-26T04:54:11+05:30 IST

మన్యం ప్రాంతంలో పాడైన రోడ్లు దెబ్బతిన్న కల్వర్టుల మరమ్మతు చేపట్టాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు.

రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపట్టాలి
రోడ్లు నిర్మాణం కోరుతూ పాదయాత్ర చేస్తున్న సీపీఐఎంఎల్‌ నేతలు

జీలుగుమిల్లి, అక్ట్టోబరు 25: మన్యం ప్రాంతంలో పాడైన రోడ్లు దెబ్బతిన్న కల్వర్టుల మరమ్మతు చేపట్టాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. జిల్లా నాయకుడు వెట్టి సుబ్బన్న మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు కొన్నిచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా రోడ్లు మరమ్మతు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రమాదా లు అధికం అయ్యాయన్నారు. కామయ్యపాలెం నుంచి అంకన్నగూడెం వరకు పాదయాత్ర చేశారు. నాయకులు భూషణం, టి.బాబురావు, పి.పెద్దిరాజు, శ్రీరామూర్తి, వై.నాగేశ్వరావు, నాగన్న, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:54:11+05:30 IST