26 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు
ABN , First Publish Date - 2022-08-20T05:26:01+05:30 IST
విశాఖపట్నంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యాదర్శి కోనాల భీమారావు అన్నారు.
భీమవరం అర్బన్, ఆగస్టు 19: విశాఖపట్నంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యాదర్శి కోనాల భీమారావు అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. భీమారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న అభివృద్ధి నిరోధక పాలనకు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. సీపీఐ నాయకులు చెల్లబోయిన రంగారావు, మామిడిశెట్టి లక్ష్మిపతి, యేలేటి విజయానంద్, ఆకలి రాము, పాలా త్రిముర్తులు, పోతుల యాకోబు, శాంతరాజు తదితరులు పాల్గొన్నారు.