Mahasabha: సీపీఐ 25వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-07T14:25:22+05:30 IST

సీపీఐ రాష్ట్ర 25వ మహాసభ(Mahasabha)లు శనివారం తిరుప్పూర్‌ తారాపురంలో ప్రారంభమయ్యాయి. విద్యకార్తీక్‌ కల్యాణమండపంలో పార్టీ సీనియర్‌ నేత

Mahasabha: సీపీఐ 25వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 6: సీపీఐ రాష్ట్ర 25వ మహాసభ(Mahasabha)లు శనివారం తిరుప్పూర్‌ తారాపురంలో ప్రారంభమయ్యాయి. విద్యకార్తీక్‌ కల్యాణమండపంలో పార్టీ సీనియర్‌ నేత నల్లకన్ను పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మహాసభల సందర్భంగా కోయంబత్తూర్‌, సేలం(Coimbatore, Salem) తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన అమరవీరుల జ్యోతులను నేతలకు అందజేశారు. ఈ మహాసభల్లో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు దేశ రాజకీయ పరిస్థితులు, ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న కేంద్రప్రభుత్వ తీరు, ప్రజలను చైతన్యవంతం చేసేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు, భవిష్యత్తులో చేపట్టనున్న ఆందోళనలపై చర్చించనున్నారు. మహాసభల చివరి రోజైన 9న 10 వేల మందితో ర్యాలీ, పద్మిని గార్డెన్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-08-07T14:25:22+05:30 IST