ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడండి
ABN , First Publish Date - 2020-11-29T06:16:21+05:30 IST
ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి
తుమ్మపాల, నవంబరు 28: ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. రైతులకు ఉరితాడు లాంటి చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించాలని, ప్రభుత్వ లోపాలను ఎండగట్టాలని సూచించారు. సదస్సులో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణ, నాయకులు పి.సత్యనారాయణ, ఆర్.దొరబాబు, రాజాబాబు, విమల, వెంకటరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.