అనంతపురంలో హాస్పిటల్‌ని వినియోగంలోకి తీసుకురండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-14T12:52:29+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

అనంతపురంలో హాస్పిటల్‌ని వినియోగంలోకి తీసుకురండి: రామకృష్ణ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల గ్రాంటు విడుదల చేసి ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ నిధులు రు.110 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.30 కోట్లు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రి ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలోనే అనంతపురం ప్రథమ స్థానంలో ఉందన్నారు. కరోనా అత్యవసర పరిస్థితి దృష్ట్యా అనంతపురం ఆసుపత్రిని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రామకృష్ణ కోరారు.

Updated Date - 2020-07-14T12:52:29+05:30 IST