సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2022-02-05T13:47:33+05:30 IST
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమవుతున్నారని
అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అశుతోష్ మిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదికను బయట పెట్టకపోవడం అప్రజాస్వామికమని ఆరోపించారు. ‘‘శాంతియుతంగా విజయవాడలో జరిగే ర్యాలీని భగ్నం చేసేందుకు మీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, అయినప్పటికీ భారీ ఎత్తున ఛలో విజయవాడ జయప్రదమైందని లేఖలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరే స్వయంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి’’ అని రామకృష్ణ లేఖలో వెల్లడించారు.