సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2022-01-16T17:57:41+05:30 IST

సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ

సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను జనవరి 26న విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. 3/7 సంవత్సరాలు ఖైదు పూర్తి చేసుకుని, పరివర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు జీవిత ఖైదీలను విడుదల చేసి, వారికి కొత్త జీవితాన్నివ్వాలని లేఖలో కోరారు. 

Updated Date - 2022-01-16T17:57:41+05:30 IST