కేంద్రం ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం లొంగిపోయింది: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2022-04-16T22:59:51+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్‌ను 135 అడుగులకే ఉంచడం కరెక్ట్‌ కాదని సీపీఐ రామకృష్ణ అన్నారు.

కేంద్రం ఒత్తిళ్లకు  వైసీపీ ప్రభుత్వం లొంగిపోయింది: సీపీఐ రామకృష్ణ

అమరావతి:  పోలవరం ప్రాజెక్ట్‌ను 135 అడుగులకే ఉంచడం కరెక్ట్‌ కాదని సీపీఐ రామకృష్ణ అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ 150 అడుగులకు పైగా ఎత్తు ఉంటేనే నీరు అందుతుందని చెప్పారు.కేంద్రం ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం లొంగిపోయిందన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. కోర్టులో చోరీకి బాధ్యుడైన మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు.న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే మంత్రిపై చర్య తీసుకోవాలన్నారు.కోర్టులో దొంగతనంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జీతం తీసుకుంటుంది శాంతిభద్రతలు కాపాడటానికా.. లేక అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయడానికా? అని రామకృష్ణ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-16T22:59:51+05:30 IST