సునీల్ దియోధర్ వ్యాఖ్యలను ఖండించిన రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-10T21:24:58+05:30 IST

ఏపీలో గత కొన్ని రోజులుగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్ అయిన విషయం విదితమే.

సునీల్ దియోధర్ వ్యాఖ్యలను ఖండించిన రామకృష్ణ

అమరావతి : ఏపీలో గత కొన్ని రోజులుగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే తాజాగా ఈ ఫిరాయింపులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయింపులపై బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాల్లో నైతికత గురించి బీజేపీ మాట్లాడటం నేతిబీరకాయలో నెయ్యి చందంగా ఉందని సెటైర్లేశారు. బీజేపీలో చేరగానే ప్రబుద్ధులు అంతా శుద్దులుగా మారతారా? అంటూ మండిపడ్డారు.


ఒక్క పసుపురంగునే కాదు అన్ని రంగులను కాషాయీకరణ చేయగలం అని సునీల్ చెప్పటం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు బీజేపీ ప్రమాదకరంగా తయారైందన్నది వాస్తవమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. రామకృష్ణ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు, ముఖ్యంగా సునీల్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Updated Date - 2020-07-10T21:24:58+05:30 IST