జగన్ ఢిల్లీ టూర్ వివరాలు వెల్లడించాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-02-16T21:31:09+05:30 IST
సీఎం జగన్ ఢిల్లీ టూర్ వివరాలు వెల్లడించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్నారు.
అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ టూర్ వివరాలు వెల్లడించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. బడ్జెట్లో కేటాయించినా నిధులు కూడా ఏపీకి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తామని రామకృష్ణ ప్రకటించారు.