ప్రభుత్వాల వైఫల్యంతోనే ఆక్సిజన్‌ కొరత

ABN , First Publish Date - 2021-05-13T06:10:41+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు.

ప్రభుత్వాల వైఫల్యంతోనే ఆక్సిజన్‌ కొరత
హిమని సెంటర్‌లోని మహత్ముని విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

గుంటూరు(తూర్పు), మే12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. సరైన సమయంతో ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కొవిడ్‌ బాధితులు మృత్యవాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించడంతో పాటు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని బుధవారం స్థానిక హిమని సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.   కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, అమీర్‌వలి, బందెల నాసర్‌జీ, దూపాటి వెంకటరత్నం, మంగా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-05-13T06:10:41+05:30 IST