దేశద్రోహం చట్టం మార్చాలి: సీపీఐ నారాయణ
ABN , First Publish Date - 2022-05-01T17:39:44+05:30 IST
రాజమండ్రి: దేశద్రోహం చట్టం మార్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
రాజమండ్రి: దేశద్రోహం చట్టం మార్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ధిక్కరణకు పాల్పడేవారిలో సీఎం జగన్, తెలంగాణ సీఎస్ ఉన్నారన్నారు. ఎయిర్ పోర్టు, పోర్టుల ద్వారా స్మగ్లింగ్ కోసం అదానీకి కట్టబెఢుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రధానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, జగన్ కట్టుబానిసయ్యారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిసినారి అని, ఆయన్ను తానెలా నమ్ముతానని నారాయణ వ్యాఖ్యానించారు.