రాజకీయ సంకుచితత్వంతోనే విమర్శలు: నారాయణ

ABN , First Publish Date - 2021-07-10T03:18:07+05:30 IST

కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని

రాజకీయ  సంకుచితత్వంతోనే విమర్శలు: నారాయణ

విజయనగరం: కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని సీపీఐ జాతీయ  కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పట్టణంలో అశోక్ గజపతిరాజును కె.నారాయణ మర్యాద పూర్వకంగా కలిసారు. అశోక్ గజపతిరాజును దొంగ అని అనడం 2021 లోనే పెద్ద జోకని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ విబేదాలు ఉండవచ్చు గాని, వ్యక్తిత్వం చూడాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లిలు వాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నైతిక విలువ లేకుండా రాజకీయాలు చేయడం తగదన్నారు. సీఎం జగన్ ఇటువంటి వాటిని నియంత్రణలో పెట్టాలన్నారు. అశోక్ పై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-10T03:18:07+05:30 IST