నిరసన తెలపడానికి స్థాయి అవసరం లేదు: నారాయణ

ABN , First Publish Date - 2022-01-02T17:54:59+05:30 IST

నిరసన తెలపడానికి స్థాయి అవసరం లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు.

నిరసన తెలపడానికి స్థాయి అవసరం లేదు: నారాయణ

హైదరాబాద్: నిరసన తెలపడానికి స్థాయి అవసరం లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సామాన్యుల స్థాయి, కమ్యూనిస్టుల స్థాయి ఒక్కటేనని అన్నారు. చెప్పులపై పన్నువిధించడంపై నిరసన తెలపడం తప్పేంటని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకే బీజేపీ జిన్నా టవర్, కింగ్‌జార్జ్ ఆస్పత్రి పేర్లను మార్చాలంటున్నారని విమర్శించారు. గోల్కొండ కోట, బ్రిటిషర్లు వేసిన రైల్వే లైన్లను బీజేపీ నేతలు కూల్చగలరా? అని నారాయణ నిలదీశారు.

Updated Date - 2022-01-02T17:54:59+05:30 IST