ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది: నారాయణ
ABN , First Publish Date - 2022-01-19T17:34:37+05:30 IST
ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని 2009 కేసీఆర్ దీక్షతో సీపీఐ నారాయణ పోల్చారు.
అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని 2009 కేసీఆర్ దీక్షతో సీపీఐ నారాయణ పోల్చారు. ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లనే 23శాతం ఫిట్మెంట్కు ఒప్పుకున్నారన్నారు. తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ధరలను పెంచటం సరైంది కాదన్నారు. ఏపీ ఎన్జీఓలు పోరాటానికి మద్దతుగా ఉంటామని సీపీఐ నారాయణ తెలిపారు.