నాయకులకు నార్కో పరీక్షలు చేయాలి: సీపీఐ నారాయణ
ABN , First Publish Date - 2021-04-14T20:48:38+05:30 IST
అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసిన వారందరికి నార్కో పరీక్షలు
తిరుపతి: అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసిన వారందరికి నార్కో పరీక్షలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 80 శాతం మంది అంబేద్కర్ ఆశయాలపై నమ్మకం లేని వారేనని ఈ నార్కో పరీక్షలలో తేలుతుందని నారాయణ పేర్కొన్నారు. అంబేద్కర్ ఓటు హక్కును కల్పించి ప్రజలకు ఆయుధాన్ని అందించారని ఆయన కొనియాడారు. ఎన్నికలే లేకుండా నేడు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.