స్వామినాథన్ కమిషన్ను అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-01-27T05:57:32+05:30 IST
స్వామినాథన్ కమిషన్ను అమలుచేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
వినుకొండటౌన్, జనవరి 26 : స్వామినాథన్ కమిషన్ను అమలుచేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటాలకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో వినుకొండలో మంగళవారం ట్రాక్టర్, ఆటో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ పోరాట పటిమతో మరణాలను సైతం లెక్కచేయకుండా రైతులు పోరాటాలు సాగిస్తున్నారన్నారు. నాడు బ్రిటీష్వారికి వ్యతిరేకంగా ప్రజానీకం పోరాటాలు చేస్తే నేడు చట్టాల విముక్తి కోసం రైతులు పోరాటాలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి కేసులకు భయపడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో బైబిల్, కేంద్రంలో భగవత్గీతను చూపి కాలం గడుపుతున్న ఈ జగన్మోహన్రెడ్డికి ప్రజలు సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, సీపీఐ ఏరియా ప్రధానకార్యదర్శి మారుతివరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.